Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం.. శశికళకు పార్టీ పగ్గాలు.. మరి అజిత్ సంగతేంటి? భేటీ ఎందుకు?

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తొలిసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరుగనుంది. గురువారం (డిసెంబర్ 29) జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం.. శశికళకు పార్టీ పగ్గాలు.. మరి అజిత్ సంగతేంటి? భేటీ ఎందుకు?
, బుధవారం, 28 డిశెంబరు 2016 (14:02 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తొలిసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరుగనుంది. గురువారం (డిసెంబర్ 29) జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆ పదవిని శశికళ అధిష్టించే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి. శశికళ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని, దాంతో పాటు ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాలని అన్నాడీఎంకేలోని ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది. ఈ వర్గంలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటంతో వీరి వాదన చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 
 
కానీ శశికళ మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే హీరో అజిత్‌తో భేటీ అయ్యారు. కేవలం అనుకూల వర్గానికి మాత్రమే ఆహ్వానాలు పంపి వారి ఆధ్వర్యంలో ఎన్నిక జరిగేలా చూసుకుని.. పార్టీ పగ్గాలను తను అందుకునే దిశగా శశికళ ప్రయత్నాలు చేస్తున్నట్లు సన్నిహితుల సమాచారం. మరోవైపు జయలలిత అన్న కుమార్తె దీప జయకుమార్ నరేంద్ర మోడీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఆమెకు మోడీ అపాయింట్‌మెంట్ లభిస్తుందో లేదో అనేది ప్రశ్నార్థకం. అలాగే అన్నాడీఎంకే అధ్యక్ష పదవి ఎన్నికల వ్యవహారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పరిశీలిస్తోంది. మరి గురువారం జరుగనున్న కీలక అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం శశికళకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెడుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నమ్మకు చిక్కులు... ప్రధాని మోడీ వద్ద తేల్చుకుంటానంటున్న జయమ్మ మేనకోడలు దీప