Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండేళ్ల పాటు ప్రేమ పేరుతో నమ్మించాడు.. నిశ్చితార్థం అయ్యాక జంప్.. ఇంటి ముందు ధర్నా

ప్రేమిస్తున్నానని రెండేళ్ల పాటు నమ్మించాడు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత జంప్ అయిన ప్రేమికుడితోనే తన పెళ్లి జరగాలని బాధిత యువతి ఇంటి ఎదుట ధర్నా చే

Advertiesment
Crime news
, మంగళవారం, 17 జనవరి 2017 (09:42 IST)
ప్రేమిస్తున్నానని రెండేళ్ల పాటు నమ్మించాడు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత జంప్ అయిన ప్రేమికుడితోనే తన పెళ్లి జరగాలని బాధిత యువతి ఇంటి ఎదుట ధర్నా చేస్తూ సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తూత్తుకుడి జిల్లా సాత్తానకులం సమీపం శంకరనకుడియిరుప్పు ప్రాంతానికి చెందిన ముత్తులక్ష్మి (22), అదే గ్రామానికి చెందిన ధర్మలింగం (25) ప్రేమించుకున్నారు. అయితే ముత్తులక్ష్మితో వివాహానికి ధర్మలింగం నిరాకరించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు రెండు కుటుంబాలతో చర్చలు జరిపి ఇరువురికి పెళ్లి జరపాలని నిర్ణయించి నిశితార్థం జరిపారు. త్వరలో వివాహం జరుగనున్న నేపథ్యంలో ధర్మలింగం, అతడి కుటుంబీకులు ఉన్నట్టుండి ఇల్లు విడిచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ముత్తులక్ష్మి తిరుచెందూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తర్వాత ప్రేమికుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. వంట సామగ్రిని పక్కనబెట్టుకుని వంట చేసుకుంటూ గడిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాత్మాగాంధీ కంటే అంబేద్కరే గొప్ప.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు