Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భయపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్.. ఎక్కడ?

covid vaccine
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (14:39 IST)
కొత్త రకం కరోనా వైరస్ భయపెడుతుంది. ఈజీ5.1 రకంగా గుర్తించిన ఈ వైరస్ ఇపుడు మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ రకం వైరస్ సోకిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతంది. అయితే, గతంలో మాదిరిగా పెద్ద ప్రభావం లేదని వైద్యులు అంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు మరణాలు వెలుగు చూడటం గుర్తుండే ఉంటుంది. ఇపుడు మరో విడత అదే రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటం మొదలైంది. ఇపుడు ఒమిక్రాన్ ఈజీ5.1 రకం వైరస్ కేసులు ఇపుడు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. 
 
దేశంలో ఈ తరహా వేరియంట్ కేసులు గుర్తించడం గమనార్హం. ఈ వేరింయట్‌ను మేలో గుర్తించినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్ కార్యకర్త వెల్లడించారు. బీజే మెడికల్ కాలేజీలో ఆయన సీనియర్ సైంటిస్టుగా పని చేస్తున్నారు. మే నెలలో గుర్తించిన తర్వాత రెండు నెలలు గడిచిపోయిందన్నారు. ఎక్స్ బీబీ 1.16, ఎక్స్ బీబీ 2.3 వేరియంట్ల తరహాలో దీని ప్రభావం పెద్దగా లేదని చెప్పారు. అయినా రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీ సర్కారుపై అవిశ్వాసం.. వాడివేడిగా చర్చ