Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు లేని ఒంటరి మహిళకు రూ.6 లక్షలు అవసరమా? కర్ణాటక హైకోర్టు (video)

woman

సెల్వి

, బుధవారం, 21 ఆగస్టు 2024 (22:43 IST)
ఒక భార్య తన భర్త నుండి నెలకు రూ.6,16,000లను భరణం కింద డిమాండ్ చేయడంతో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి దిగ్భ్రాంతికి గురైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహిళ తరపు న్యాయవాది తన క్లైంట్ ఖర్చులను న్యాయమూర్తికి వివరించేందుకు ప్రయత్నించగా, ఆ మొత్తాన్ని విని న్యాయమూర్తి మందలించారు. 
 
జర్నలిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ చేసిన ట్వీట్‌లో భార్య డిమాండ్‌ల సారాంశం ఉంది. కోర్టు క్లిప్ ప్రకారం, భార్య మోకాలి నొప్పి, ఫిజియోథెరపీ కోసం రూ.4-5 లక్షలు అడుగుతోంది. షూలు, డ్రెస్‌లకు రూ.15,000, ఇంటి భోజనం కోసం రూ.60,000, బయట భోజనం చేయడానికి మరికొన్ని వేలు. ఇలా ఆ మహిళ డిమాండ్ల ఆధారంగా కోర్టు ప్రశ్నించింది. 
 
ఇంత మొత్తాన్ని ఆమె ఖర్చు చేస్తుందా? ఆమె ఖర్చు చేయాలనుకుంటే, ఆమెను  సంపాదించనివ్వండి.. అని న్యాయమూర్తి అన్నారు. ఈ "లక్షల సంఖ్య"కు బదులుగా న్యాయవాది నుండి వాస్తవ గణాంకాలు ఇవ్వాలని న్యాయమూర్తి మహిళను కోరారు. సెక్షన్ 24 కింద చర్యలు తప్పవు. భర్త తన భార్యతో వివాదం కలిగి ఉంటే రూ.6,16,000 మంజూరు చేయడం అతనికి శిక్ష కాదని న్యాయమూర్తి తెలిపారు. 
 
పిల్లలు లేని ఒంటరి మహిళకు రూ.6 లక్షలు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సదరు మహిళ డిమాండ్‌కు లొంగకుండా సరైన తీర్పు ఇచ్చినందుకు మహిళా న్యాయమూర్తిని ప్రశంసిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ వాసులకు టొస్కానో అద్భుతమైన ఇటాలియన్ రుచులు