Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా మహమ్మారి ఉగ్రరూపం- 24 గంటల్లో 100మంది మృతి

కరోనా మహమ్మారి ఉగ్రరూపం- 24 గంటల్లో 100మంది మృతి
, శుక్రవారం, 15 మే 2020 (10:20 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కోవిడ్‌ బాధితుల సంఖ్య 82 వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 4వేల కొత్త కేసులు నమోదు కాగా, 100 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,649కి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 81,970కి చేరింది.

వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 27,920 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 51,401 మంది చికిత్స పొందుతున్నారు. వలస కూలీలు సొంత ఊళ్లకు ప్రయాణం కావడంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం మరింత కలవర పెడుతోంది.
 
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా మరణించినట్టు వరల్డ్ మీటర్ పేర్కొంది. తాజా లెక్కల ప్రకారం 4,521,260 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

303,071 మంది మరణించారు. 1,702,124 మంది కోలుకున్నారు. అమెరికా, స్పెయిన్, యూకే ఈ వైరస్ దాటికి గడగడలాడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 95,605 మందికి కొత్తగా వైరస్ లక్షణాలు గుర్తించారు. 5,306 మంది ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.10 వేలు ఇస్తాం.. పాదపూజ చేస్తాం.. రాష్ట్రానికి రావొద్దు : నాగాలాండ్ విజ్ఞప్తి