Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్ర‌ధాని మోదీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్య

క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే

ప్ర‌ధాని మోదీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్య
, సోమవారం, 28 మే 2018 (17:54 IST)
క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే... పేటీఎం అంటే 'పే టు మోదీ' అని కొత్త భాష్యం చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ కరో) అంటూ ట్యాగ్ లైన్ జత చేసింది. 
 
పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తున్నట్టే... ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు పేటీఎంతో మోదీకి లింక్ పెట్టి ట్వీట్ చేయడం పట్ల రమ్య పైన బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. 
 
ఓ వ్యక్తి (రాహుల్ గాంధీ) కోసం నౌకరీ, చాకిరీ చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మన డేటా వాటికన్‌కు తరలిపోవడం కంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే బెటర్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు రోజులు - 11 మంది మృగాళ్ళు.. ఒక బాలికను...?