Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు.. ప్రధాని మోదీపై పిటిషన్

Modi
, బుధవారం, 23 నవంబరు 2022 (15:19 IST)
Modi
బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నందుకు ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదలైన వీడియోలో ప్రధాని మోదీ పక్కన నిలబడిన ఓ బాలిక తన గుజరాతీ భాషలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మోదీని, బీజేపీని పొగిడిన అమ్మాయి మెడలో బీజేపీ లోగో ఉన్న దుపట్టా ఉంది.
 
రామ మందిరంతో పాటు పలు విషయాల గురించి ఆ బాలిక మాట్లాడుతుండటం ప్రధాని మోదీ పక్కనే కూర్చుని వింటున్నారు. ఆ తర్వాత ఆ బాలిక ధరించిన దుపట్టాపై సంతకం చేసి బాలికను అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బాలికను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన సుప్రియ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాది నుంచి విశాఖ కేంద్రం సీఎం జగన్ పాలన?