Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య గంటల పాటు ఫోన్ మాట్లాడుతోందని.. కాలు విరగ్గొట్టిన భర్త.. ఎక్కడ?

భార్యాభర్తల సంబంధాలు ఓ వైపు ఫోన్లు, సోషల్ మీడియాలతో ప్రభావంతో పెటాకులవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఓ భార్య గంటల పాటు వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే కోపంతో భర్త ఆమె కాలి విరగ్గొట్టిన ఘటన తమిళనాడులోని కోయంబ

భార్య గంటల పాటు ఫోన్ మాట్లాడుతోందని.. కాలు విరగ్గొట్టిన భర్త.. ఎక్కడ?
, బుధవారం, 27 జులై 2016 (14:44 IST)
భార్యాభర్తల సంబంధాలు ఓ వైపు ఫోన్లు, సోషల్ మీడియాలతో ప్రభావంతో పెటాకులవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఓ భార్య గంటల పాటు వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే కోపంతో భర్త ఆమె కాలి విరగ్గొట్టిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై సాయిబాబా కాలనీ, కేకే పుదూరుకు చెందిన మణికండన్‌ డ్రైవర్‌గా పనిచేస్తోంది. ఇతని భార్య అన్నపూర్ణి (29) సెల్‌ఫోన్‌లో ఎవరితోనే గంటల పాటు మాట్లాడుతూ భర్తను పట్టించుకోలేదు. భర్త ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినా బంధువని చెప్పేది. దీనిపై భార్యాభర్తల వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
మాటామాటా పెరిగి భార్యపై మణికండన్ చేజేసుకున్నాడు. అంతేగాకుండా ఇంట్లో ఉన్న ఇనుప కమ్మీతో దాడి చేశాడు. దీంతో అన్నపూర్ణి కాలి ఎముక విరిగింది. ప్రస్తుతం కోవై ప్రభుత్వాసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన  వివరాలను తెలుసుకున్న ఆస్పత్రి వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మణికండన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్టీ నుంచి సస్పెండ్ చేసినా బిల్లుపై తగ్గేది లేదు: డాక్టర్ కేవీపీ