Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

Advertiesment
Girl

సెల్వి

, శుక్రవారం, 21 నవంబరు 2025 (11:30 IST)
Girl
స్కూలుకు లేటుగా వచ్చిందనే కారణంతో టీచర్ విద్యార్థిని బలవంతంగా వంద గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఈ నెల 8వ తేదీన స్కూలుకు లేటుగా వెళ్లిన ఆరో తరగతి బాలికను స్కూల్ టీచర్‌ 100 గుంజీలు తీయాలంటూ బలవంతం చేసింది. అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాలిక.. గుంజీలు తీయడంతో అస్వస్థతకు గురైంది. 
 
వెంటనే ఆస్పత్రికి టీచర్లు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బ్యాగుతో పాటు గుంజీలు తీయడంతోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లి ఆరోపించింది. బ్యాగుతో పాటే గుంజీలు తీయమని టీచర్ బలవంతం చేసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నార... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...