Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు పట్టణాలకు చైనా పేర్లు.. దలైలామాకు వ్యతిరేకంగా?

1962 నాటి చైనా-భారత్ యుద్ధ సమయంలో అరుణాచల్ లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్యా సరిహద్దు సమస్య నెలకొంది. కానీ ఇప్పటి దాకా ఎన్నో సమావేశాలు జరిగినా ఈ సమస్య కొలిక్కి రా

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు పట్టణాలకు చైనా పేర్లు.. దలైలామాకు వ్యతిరేకంగా?
, బుధవారం, 19 ఏప్రియల్ 2017 (13:29 IST)
1962 నాటి చైనా-భారత్ యుద్ధ సమయంలో అరుణాచల్ లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్యా సరిహద్దు సమస్య నెలకొంది. కానీ ఇప్పటి దాకా ఎన్నో సమావేశాలు జరిగినా ఈ సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌దో దోస్తీ చేసి భారత్‌ భూభాగాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా ప్లాన్ చేస్తున్న చైనా.. మరో అడుగుముందుకేసింది. 
 
ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌.. అని అది తమ ప్రాంతమేనని వాదిస్తున్న చైనా, అరుణాచల్‌లోని ఆరు పట్టణాలకు చైనా పేర్లు పెట్టి కవ్వింపు చర్యలకు దిగింది. రాష్ట్రంలోని ఆరు పట్టణాలకు మిలా రీ, ఖ్యోడెన్‌ గార్బొ, మాణిఖ్వా, బుమొలా, నామకాపబ్‌ రీ, వొగ్యలిన్‌ లింగ్‌ అనే పేర్లు ఖరారు చేసినట్లు చైనా మీడియా వెల్లడించింది. 
 
కానీ ఇదంతా చైనా కుట్రని.. ఆయా పట్టణాలకు ఆపేర్లు పూర్వకాలానివని.. వాచిని ప్రమాణీకరించడం సులభం కాదని టిబెట్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకులు అంటున్నారు. కానీ దలైలామా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించి.. భారత దౌత్యాధికారులకు సమన్లు పంపిన చైనా.. తొమ్మిది రోజులకు తర్వాత ఆరు రాష్ట్రాల పేరు మార్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియాలకు చెక్.. 18 దేశాలకు వీసాలొద్దు.. రష్యా ప్రకటన