Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురుషులకూ పిల్లల సంరక్షణ సెలవులు

పురుషులకూ పిల్లల సంరక్షణ సెలవులు
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:32 IST)
పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు స్త్రీలకే కాదు ఇకపై పురుషుల కూడా సెలవులు లభించనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. అయితే సింగిల్‌ పెరేంట్స్‌గా ఉన్న పురుష ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సౌలభ్యం వర్తించనుంది.

అలాగే, అవివాహితుడు లేదా భార్య చనిపోయిన లేదా విడాకులు పొందిన మగ ఉద్యోగులకూ ఈ సెలవు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీవన సౌలభ్యం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి కొంత కాలం క్రితమే ఉత్తర్వులు జారీ చేశామని, అయితే ఇంకా దీనిపై సరైన అవగాహన రాలేదని చెప్పారు.

ఇప్పుడు మరింత సడలింపుల్లో భాగంగా.. పిల్లల సంరక్షణలో ఉంటున్న తండ్రి... ముందస్తు అనుమతితో సెలవులు తీసుకోవచ్చునని పేర్కొన్నారు. అదనంగా సెలవు ప్రయాణ రాయితీని (ఎల్‌టిసి) కూడా పొందవచ్చునని తెలిపారు.

పిల్లల సంరక్షణ సెలవులు తొలి 365 రోజులకు గానూ 100 శాతం జీతం చెల్లించనున్నారు. తదుపరి సంవత్సరానికి 80 శాతం జీతం చెల్లించనున్నట్లు జితేంద్ర సింగ్‌ తెలిపారు.

విభిన్న ప్రతిభావంతుల కలిగిన సింగిల్‌ పేరెంట్‌ అయితే.. గతంలో ఉన్న 22 సంరక్షణ బాధ్యతలను తొలగించి.... ఇప్పుడు ఎప్పుడైనా సెలవులు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుల వెతలను వినిపించాడనే లోకేశ్ పై అక్రమ కేసులు: టీడీపీ