Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్కపూట కూడా భోజనం లేకుండా 18 యేళ్లుగా బ్లాక్‌ టీతో బతికేస్తున్న మహిళ.. బరువు 45 కేజీలు

సాధారణం ఒక్కపూట భోజనం లేకుంటే ఆకలికి ఉండలేం. అలాంటిది ఓ మహిళ 18 సంవత్సరాలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం రెండు కప్పుల బ్లాక్‌ టీతో బతికేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ కథలోకి వెళితే

ఒక్కపూట కూడా భోజనం లేకుండా 18 యేళ్లుగా బ్లాక్‌ టీతో బతికేస్తున్న మహిళ.. బరువు 45 కేజీలు
, బుధవారం, 24 ఆగస్టు 2016 (14:24 IST)
సాధారణం ఒక్కపూట భోజనం లేకుంటే ఆకలికి ఉండలేం. అలాంటిది ఓ మహిళ 18 సంవత్సరాలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం రెండు కప్పుల బ్లాక్‌ టీతో బతికేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ కథలోకి వెళితే... 
 
కొరియా జిల్లాలో పీలీ బాయి(48) అనే మహిళ ఉంది. ఈమెకు 1995లో పెళ్లి జరిగింది. అయితే, భర్త వద్ద కేవలం ఒక్క రోజు మాత్రమే కాపురం చేసింది. బక్కపలుచటి దేహంతో ఆశ్చర్యపోయేలా ఉన్న ఆమెను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారు చేసిన పరీక్షల్లో ఆమె అసలు ఆహారమే ముట్టలేదని తెలిసింది. కేవలం రోజుకు రెండు కప్పులు బ్లాక్ టీ తీసుకుంటూ జీవిస్తున్నట్టు పేర్కొంది. 
 
దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఇది నిజంగా వైద్యశాస్త్రం ప్రకారం ఓ అద్భుతమని పేర్కొన్నారు. ఆమెను పరిశీలించిన వైద్యులు... ఆమె శారీరకంగా బలంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే, ఒక వ్యక్తి బ్లాక్ టీపై ఆధారపడి జీవించడం చాలా అరుదు అని, అని అసలు సాధ్యం కాదని కూడా వారు చెప్పారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రి వైద్యులు ఆమెను బ్లాక్ టీ ఉమెన్ అని పిలుస్తున్నారట. ఎలాంటి ఆహారం తీసుకోకుండానే పీలీ బాయి ప్రస్తుతం 45 కేజీల బరువు ఉంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు అత్త ఊరు ప్రేమంటే ఇదేగా... ఎమ్మెల్యే రోజా సెటైర్లు