Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామంపై కేంద్రం కీలక నిర్ణయం

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామంపై కేంద్రం కీలక నిర్ణయం
, ఆదివారం, 20 మార్చి 2022 (22:11 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ డోసుల మధ్య విరామాన్ని 12 నుంచి 16 వారాలుగా ఉండగా, సమయాన్ని 8 నుంచి 16 వారాలకు తగ్గించింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ కేంద్రానికి సిఫార్సు చేసింది. 
 
మరోవైపు, కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య ఉన్న 28 రోజుల విరామంలో ఎలాంటి మార్పులేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ - ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించాయి. దీన్ని భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తిచేసింది. ఇకపోతే కోవాగ్జిన్‌ను భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీజల్ టోకు విక్రాయలపై రూ.25 పెంపు