Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్ ‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టాడు.. షాక్ కొట్టి చనిపోయాడు.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అధికంగా సెల్ ఫోన్లను వాడటం.. ఛార్జింగ్‌లో ఉంచి చాటింగ్ చేయడం వంటి చర్యలు అధికమవుతు

సెల్ ‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టాడు.. షాక్ కొట్టి చనిపోయాడు.. ఎక్కడ?
, మంగళవారం, 6 జూన్ 2017 (11:27 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అధికంగా సెల్ ఫోన్లను వాడటం.. ఛార్జింగ్‌లో ఉంచి చాటింగ్ చేయడం వంటి చర్యలు అధికమవుతున్నాయి. ఇలా ఇంట్లో సెల్‌ఫోన్‌కు ఛారింగ్‌కు పెట్టే సమయంలో విద్యుదాఘాతానికిగురై ధర్మన్‌(38) మృతి చెందాడు. ఈ సంఘటన సింహరాజుపురంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంచాయతీ కోసరాపల్లి దళితవాడకు చెందిన కన్నన్‌ కుమారుడు ధర్మన్‌(38) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. సోమవారం కూలీ పనులకు వెళ్లి వచ్చి భోజనం చేసిన అనంతరం సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో రెండు, మూడు రోజులుగా హై వోల్టేజ్ సమస్య ఉందని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ధర్మన్ కుటుంబీకులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మక్కామసీదుకు 500 కిలోల ఖర్జూర ఫలాలిచ్చిన అరబ్ రాజు.. ఔరంగజేబు కానుకగా ఏమిచ్చారంటే?