Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎవరైతే మాకేంటి.. మేం చెబితే వినాల్సిందే.. తమిళులైనా, కన్నడిగులైనా సరే : కావేరి తీర్పుపై సుప్రీంకోర్టు

కావేరి జలాల వివాదంపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై రోజుకో మలుపు తిరుగుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ కర్నాటక ప్రభుత్వం వేసిన పిట

ఎవరైతే మాకేంటి.. మేం చెబితే వినాల్సిందే.. తమిళులైనా, కన్నడిగులైనా సరే : కావేరి తీర్పుపై సుప్రీంకోర్టు
, సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:38 IST)
కావేరి జలాల వివాదంపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై రోజుకో మలుపు తిరుగుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ కర్నాటక ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని, తీర్పును పునఃసమీక్షించాలని కర్నాటక సర్కారు కోరగా, దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలు కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని, తమిళులైనా, కన్నడిగులైనా తామంతట తాము చట్టంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. 
 
రెండు రాష్ట్రాలూ చట్టాన్ని గౌరవించాలని, తాము ఎన్నో ఆలోచించే ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. అదేసమయంలో ఈ నెల 5న ఇచ్చిన తీర్పును సవరిస్తూ, 15 వేల క్యూసెక్కులకు బదులుగా 12 వేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 20 వరకూ తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కర్ణాటకకు ఆదేశాలిస్తూ, కావేరీ జలాల వివాదంపై తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో మితిమీరిపోతున్న ఇసుక అక్రమ రవాణా!