Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడు బస్సు అనుకుని.. తెలంగాణ బస్సుకు నిప్పు ... ఆంధ్రా వ్యక్తి సజీవదహనం

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. షిర్డీ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సుకు కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమ

తమిళనాడు బస్సు అనుకుని.. తెలంగాణ బస్సుకు నిప్పు ... ఆంధ్రా వ్యక్తి సజీవదహనం
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (09:29 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. షిర్డీ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సుకు కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అలాగే ఆ బస్సులో మరికొంతమంది మృతులున్నట్లు సమాచారం. 
 
కావేరీ నదీ జలాల విషయంపై కర్ణాటక రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఆందోళనలు విధ్వంసాలకు దారితీయగా... శుక్రవారం షిర్డీ- హైదరాబాద్‌ బస్సుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సు టీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఉండగా తమిళనాడు(టీఎన్) రాష్ట్రానికి చెందిన బస్సు అనుకుని ఆందోళనకారులు నిప్పుపెట్టారు. 
 
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన విహాన్ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరికొంత మంది కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. కాగా... ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా తెలుగు వారే ఉన్నట్లు సమాచారం.
 
మరోవైపు.. కర్నాటక వ్యాప్తంగా భారీ సంఖ్యలో బలగాలను మొహరించివున్న విషయం తెల్సిందే. పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాను కానీ... కేంద్రాన్ని ఒప్పించలేక పోయా : చంద్రబాబు