Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతివేగంతో కారు ఢీ.. గాల్లోకి ఎగిరి.. రెప్పపాటులో తల్లి మృతి.. కుమార్తెకు గాయాలు..

రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్ని సూచనలు, జాగ్రత్తలు చేస్తున్నా.. ప్రమాదాలు మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. అహ్మదాబాద్‌లో తాజాగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెప్పపాటులో మృత్యువు కబలించింద

అతివేగంతో కారు ఢీ.. గాల్లోకి ఎగిరి.. రెప్పపాటులో తల్లి మృతి.. కుమార్తెకు గాయాలు..
, మంగళవారం, 8 నవంబరు 2016 (15:44 IST)
రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్ని సూచనలు, జాగ్రత్తలు చేస్తున్నా.. ప్రమాదాలు మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. అహ్మదాబాద్‌లో తాజాగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెప్పపాటులో మృత్యువు కబలించింది. కుమార్తెతో కలిసి రోడ్డు దాటుతున్న తల్లి క్షణాల్లో మృత్యు ఒడికి చేరుకుంది. 
 
కుమార్తెతో కలిసి రోడ్డు దాటుతుండగా.. అతి వేగంతో వచ్చిన కారు తల్లిని ఢీ కొట్టింది. అతి వేగంగా వచ్చిన కారు తల్లీకూతుళ్లను ఢీకొంది. దాంతో ఇద్దరూ గాల్లోకి ఎగిరిపడ్డారు. తల్లి తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె గాయాలతో బయటపడింది. అంత ప్రమాదం జరిగినా కారు మాత్రం ఆగలేదు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సబ్ వేలను ఉపయోగించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నియంత్రించవచ్చునని.. అయితే అతి వేగంగా కారు నడిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని.. కారు వేగంగా వెళ్లడంతోనే ఈ ఘోరం జరిగిపోయిందని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేలి జాతి గుర్రం పేరు సుల్తాన్.. ఆడి కారు కంటే ధరెక్కువ.. పాస్‌పోర్ట్ రెడీ? రోజుకు లక్ష?