Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీలో దోపిడీ మాత్రమే జరిగింది.. : వైద్య పరీక్షల్లో కనిపించని రేప్ ఆనవాళ్లు!

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జేవార్ దోపిడీ, అత్యాచార కేసులో కీలక మలుపు తిరిగింది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని వైద్యులు

Advertiesment
Bulandshahr gang rape
, శనివారం, 27 మే 2017 (09:23 IST)
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జేవార్ దోపిడీ, అత్యాచార కేసులో కీలక మలుపు తిరిగింది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని వైద్యులు చెపుతున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఓ కుటుంబానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు... వాహనంలో బులందర్‌షహర్ వెళ్తుండగా, కొందరు దుండగలు అడ్డగించి ఒకరిని హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుపోగా, నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి తెగబడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమ కణతలపై తుపాకి గురిపెట్టి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళలు ఆరోపించారు. 
 
అయితే వారికి నిర్వహించిన సూపర్‌మాటోజో పరీక్షలో అత్యాచారానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని వైద్యులు చెబుతుండడం ఈ కేసులో ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్‌ఎస్‌పీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే2.. పంజాబ్‌లోనే అత్యధికంగా?