Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డొనాల్డ్ ట్రంప్‌కు 1001 రాఖీలు.. మోడీకి 501 రాఖీలు.. ఎవరు పంపారు?

భారతీయులకు చెందిన ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెట్టినా.. భారతీయులు మాత్రం ఆయన పట్ల గౌరవప్రదంగా నడుచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకుని ట్రంప్‌కు 1001 రాఖ

డొనాల్డ్ ట్రంప్‌కు 1001 రాఖీలు.. మోడీకి 501 రాఖీలు.. ఎవరు పంపారు?
, శనివారం, 5 ఆగస్టు 2017 (17:54 IST)
భారతీయులకు చెందిన ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెట్టినా.. భారతీయులు మాత్రం ఆయన పట్ల గౌరవప్రదంగా నడుచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకుని ట్రంప్‌కు 1001 రాఖీలు పంపారు.. ట్రంప్ గ్రామం సోదరీమణులు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని మేవార్ ప్రాంతం, మారోరా గ్రామానికి ''ట్రంప్ గ్రామం'' అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ గ్రామానికి ట్రంప్ విలేజ్ అంటూ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ అనధికారిక నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 7) రాఖీ పౌర్ణిమను పురస్కరించుకుని ఆ గ్రామానికి చెందిన యువతులు డొనాల్డ్ ట్రంప్‌ను తమ అగ్రజునిగా, పెద్ద సోదరునిగా భావిస్తూ..1001 రాఖీలు త‌యారు చేసి అమెరికాకు పంపారు. 
 
డొనాల్డ్ ట్రంప్‌తో ఆగిపోకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా 501 రాఖీలు పంపారు. వీరిద్దరూ ఏకంగా తమ గ్రామాన్ని సందర్శించాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ సూచన మేరకు సులభ్ విభాగం ఈ గ్రామంలో 95 టాయిలెట్లను నిర్మించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ యువకుడు నిద్రపోతే ప్రాణం పోతుంది.. (వీడియో)