Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లైన వారం రోజుల్లోనే నవ వధువు ఆత్మహత్య.. కారణం అదే?

Advertiesment
Bride
, బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:38 IST)
పెళ్లైన వారం రోజుల్లోనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని వేలూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వేలూరు సమీప గ్రామానికి చెందిన యువతికి కాట్పాడికి చెందిన బాలాజీ అనే యువకుడితో ఆగస్టు 23వ తేదీన వివాహం ఘనంగా జరిగింది. ఇక నూతన దంపతుల కోసం విందు ఏర్పాటు చేయగా మూడు రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లారు ఈ కొత్త జంట.
 
కాగా ఆదివారం రాత్రి ఇంటి మేడపై ఒంటరిగా వుండిన నవవధువు గదిలోంచి కేకలు వినిపించాయి. కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి చూడగా... నవవధువు ఒంటిపై కిరోసిన్ పోసుకుని మంటల్లో కాలిపోతూ కనిపించింది.
 
ఇక వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత కాసేపటికి చికిత్స పొందుతూ ఆ యువతి కన్నుమూసింది. 
 
ఇక ఆ గదిలో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళి కట్టిన రోజు నుంచి భర్త అనుమానంతో వేధిస్తున్నాడని ఎవరితో మాట్లాడిన సూటిపోటి మాటలు అంటూ మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడని అందులో రాసివుంది. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌