Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నతల్లి చంపి.. గుండెకాయను తీసి మిరియాల పొడి చట్నీతో కలుపుకుని తినేశాడు..

మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె

కన్నతల్లి చంపి.. గుండెకాయను తీసి మిరియాల పొడి చట్నీతో కలుపుకుని తినేశాడు..
, మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:52 IST)
మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. యేలవ(65) అనే వృద్ధురాలు తన కొడుకు సునీల్ (27)తో కలిసి ఉంటుంది. సునీల్ సోమవారం పీకల దాకా తాగొచ్చాడు. పొరిగింటి వారిని ఆకలేస్తుందని అన్నం పెట్టమన్నాడు.
 
వారు లేదని చెప్పడంతో ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో తల్లి యేలవను చితకబాది చంపేశాడు. అన్నం పెట్టలేదనే కోపంతో ఆమెను దారుణంగా చంపి.. ఆమె శరీరం నుంచి గుండెను వేరు చేసి మిరియాల పొడి, చట్నీతో కలుపుకుని తినేశాడు. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సునీల్‌ అరెస్టయ్యాడు. సునీల్ భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటి వద్దనే ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరె 'అర్జున్ రెడ్డి'లో అమ్మాయిలు పెండ్లి కాకుండానే ప్రెగ్నెంట్... వీహెచ్ ఫైర్