Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం.. కోళ్లు - బాతుల చంపేయాలంటూ ఆదేశం

Advertiesment
birdflue
, గురువారం, 15 డిశెంబరు 2022 (10:47 IST)
కేరళ రాష్ట్రంలో మరోమారు బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. దీంతో తక్షణం బాతులు, కోళ్లను చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ పంజా విసిరింది. దీంతో 8 వేల పెంపుడు పక్షులైన బాతులను చంపేయాలని స్థాని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. అలాగే, కోళ్లు, మాంసం అమ్మకాలు, ఎగుమతులపై కూడా నిషేధం విధించింది. 
 
బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు క్లోరినేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా, కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో పంజా విసిరింది. ఇతర ప్రాంతాలకు కూడా ఇది వ్యాపించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
మరోవైపు, పోలీసులు, రెవెన్యూ, జంతు సంరక్షణ శాఖ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో రక్షణ చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్ళు, బాతులు, ఇతర మాంసం అమ్మకాల ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. చనిపోయిన పక్షుల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డీసీజెస్ ల్యాబ్‌కు పంపించారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల మాంసాన్ని ఆరగించడం వల్ల అది మనుషులకు సోకే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజా సంగ్రాయ యాత్రకు నేటితో పరిసమాప్తం... భారీ బహిరంగ సభ