Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నయ్యా అంటూ రాఖీ కట్టేందుకు వస్తే.. రెండు రోజులు రేప్ చేశాడు..

ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మంటగలిసిపోతున్నాయి. అన్నయ్యా అంటూ రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి

అన్నయ్యా అంటూ రాఖీ కట్టేందుకు వస్తే.. రెండు రోజులు రేప్ చేశాడు..
, మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (13:27 IST)
ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మంటగలిసిపోతున్నాయి. అన్నయ్యా అంటూ రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టడానికి వచ్చిన సోదరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని బంద నగరం తింద్వారీకి చెందిన 15 సంవత్సరాల బాలిక రక్షాబంధన్‌ రోజున అన్నయ్య వరసయ్యే యువకుడికి రాఖీ కట్టడానికి అతని ఇంటికి వెళ్లింది. అదే అదునుగా తీసుకున్న ఆ కీచకుడు బాలికను బంధించాడు. 
 
రెండు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను నేను చంపేస్తా- ఎఫ్‌బీలో ఎవరు ఎవరిని బెదిరించారు?