Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

17 ఏళ్ల యువతిపై ఎనిమిది మంది.. ఎనిమిది నెలల పాటు సామూహిక అత్యాచారం

ఆమెకు 17 సంవత్సరాలు. ఎనిమిది నెలల పాటు ఆమెపై అత్యాచారం జరిగింది. అదీ ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ముంబైలోని నవ్‌ఘర్ పోలీస్ స్టే

17 ఏళ్ల యువతిపై ఎనిమిది మంది.. ఎనిమిది నెలల పాటు సామూహిక అత్యాచారం
, ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (14:18 IST)
ఆమెకు 17 సంవత్సరాలు. ఎనిమిది నెలల పాటు ఆమెపై అత్యాచారం జరిగింది. అదీ ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ముంబైలోని నవ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. భయందర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు పక్కింట్లో ఉండే 20 ఏళ్ల యువకుడికి పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. 
 
ఎనిమిది నెలల క్రితం ఆమెను ఆ ప్రాంతానికి చెందిన ఓ వాటర్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాలిక కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులతో భయపడిన బాలిక మిన్నుకుండిపోయింది. 
 
ఆ యువకుడితో పాటు అతని స్నేహితులు ఏడుగురు కూడా ఆమెపై ఎనిమిది నెలల పాటు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. ఆపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తగ్గించినట్టు తగ్గించి.. మళ్లీ 'పెట్రో' వడ్డన.. ఆయిల్ కంపెనీలు