అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రచంపంచ యోగ నిద్రలో మునిగిపోయింది. పార్టీలు, దేశాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులోభాగంగా కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా యోగా దినోత్సవం నిర్వహించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా బాలీవుడ్ హాట్ తార బిపాసాబసును ఆహ్వానించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు.. పలువురు మంత్రులు ఆశీనులైవుంటే బిపాసాబసు తన యోగాసాలతో ఆలరించారు. వీటిని సిద్ధరామయ్య చూస్తూ తరించిపోయారు.
ఇంతవరకు బాగానే, రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఈ శిబిరంలో గంటన్నర పాటు మాత్రమే ఆమె యోగాసనాలు వేసింది. ఇందుకోసం ఆమెకు చెల్లించిన పైసలు అక్షరాలా కోటిన్నర రూపాయలు చెల్లించారు. అంతేకాకుండా రానుపోను ఖర్చులతో పాటు ఒకరోజు బెంగళూరులో ఆమె బస కోసం అదనంగా మరింత సొమ్ము ఖర్చుచేసినట్లు తెలుస్తోంది.
బిపాసా గంటన్నరపాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు సర్కారు ఇలా రూ.కోటిన్నర చెల్లించడంపై ప్రజాసంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సిద్దరామయ్య ప్రభుత్వం మరో చిక్కులో పడినట్లు అయింది.