Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. ఆ వ్యక్తి సమాచారం ఇస్తే రూ.10లక్షల రివార్డ్

Rameshwaram cafe

సెల్వి

, బుధవారం, 6 మార్చి 2024 (19:20 IST)
Rameshwaram cafe
మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో పేలుడుతో ఘటనతో పది మంది గాయపడ్డారు. రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు కారణమైన ఐఇడిని అమర్చిన వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఇస్తే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. వాంటెడ్ పోస్టర్‌లో నిందితుడి డ్రాయింగ్‌ను విడుదల చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. 
 
ఎన్ఐఏ, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ రెండూ మాన్‌హాంట్ నిర్వహిస్తున్నాయి. అయితే పేలుడు దర్యాప్తులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. విచారణను కేంద్ర ఏజెన్సీకి అప్పగించడానికి కర్ణాటక ప్రభుత్వం నిరాకరించింది. అందువల్ల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం దర్యాప్తు ప్రారంభించాలని ఎన్ఐఏని ఆదేశించింది. 
 
నగర పోలీసులు కీలకమైన ఆధారాలను కనుగొన్నారు. కేసును ఛేదించడానికి దగ్గరవుతున్నారని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర బుధవారం తెలిపారు. నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కేఫ్ పేలుడు తర్వాత ఆ కేఫ్ మూతపడింది. ఇది మార్చి 8న తిరిగి ఓపెన్ అవుతుంది.
 
మార్చి 1న లంచ్ సమయంలో, ఈ కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ఒక గంట ముందు కేఫ్‌ను సందర్శించిన వ్యక్తి వల్లే ఇది జరిగిందని.. సదరు వ్యక్తి టైమర్‌తో ఐఈడీ ఉన్న బ్యాగ్‌ను వదిలివేసినట్లు కనుగొన్నారు. 
 
ఆ వ్యక్తి ఒక ప్లేట్ రవ్వ ఇడ్లీ కోసం ఆర్డర్ ఇచ్చాడు కానీ అతని దగ్గర అది లేదు. ఈ క్లిప్ ఆధారంగా అనుమానిత నిందితుడి అస్పష్టమైన చిత్రం వైరల్ అయింది. ఈ ఫోటోలోని వ్యక్తి అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు. అతడి గురించి సమాచారం అందించే వారికి రివార్డు కూడా ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.7,299 ప్రారంభ ధరతో జియోమీ రెడ్ మీ ఏ3 స్మార్ట్‌ఫోన్‌