Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ ఖర్మకాలే రోజు వస్తుంది : రాహుల్ వ్యాఖ్యలు

మోడీ ఖర్మకాలే రోజు వస్తుంది : రాహుల్ వ్యాఖ్యలు
, ఆదివారం, 5 మే 2019 (14:51 IST)
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంచలన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. నరేంద్ర మోడీ… యుద్ధం ముగిసిందని, ఖర్మఫలం మీకోసం ఎదురుచూస్తుందని దుయ్యబట్టారు. రాజీవ్ గాంధీని విమర్శించడం వల్ల తాను రాజకీయంగా లబ్ది పొందానన్న భ్రమలో మోడీ ఉన్నారన్నారు. 
 
మోడీ… మీ మీద ఇప్పటికి ప్రేమ ఉందని ఒక కౌగిలింత ఇస్తున్నానని రాహుల్ ట్వీట్ చేశారు. దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఇలాంటి విమర్శలు చేయడం మోడీ దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చురకలంటించారు. 
 
రాజీవ్‌పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని గతంలో ఢిల్లీ కోర్టు చెప్పిందని గుర్తుచేశారు. బోపార్స్ స్కామ్‌లో రాజీవ్ లంచం తీసుకున్నట్టుగా ఎక్కడ ఆధారాలు లేవని చిదంబరం స్పష్టం చేశారు. మోడీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ, బీజేపీకి ప్రజలే బుద్ది చెబుతారని ప్రియాంక గాంధీ తాజా వ్యాఖ్యలపై సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాపై దాడి జరగడం ఇది తొమ్మిదో సారి : అరవింద్ కేజ్రీవాల్