అమ్మాయి బొమ్మ ఎదపై పొడిపించుకుని బెంగళూరు వీధుల్లో ఆబోతులా వాడు...
కామాంధుల చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఇటీవలే నూతన వేడుకల సందర్భంగా బెంగళూరు నగరంలో ఓ యువతిని వేధించినవారిలో ఒకడు తన ఎదపై పొడిపించుకుని రోడ్లపై ఒంటరిగా కనిపించే అమ్మాయిని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మాయి ఒంటరిగా కనబడటంతో
కామాంధుల చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఇటీవలే నూతన వేడుకల సందర్భంగా బెంగళూరు నగరంలో ఓ యువతిని వేధించినవారిలో ఒకడు తన ఎదపై పొడిపించుకుని రోడ్లపై ఒంటరిగా కనిపించే అమ్మాయిని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మాయి ఒంటరిగా కనబడటంతో ఆమెపై అఘాయిత్యం చేయబోయారు. ఐతే ఆమె ధైర్యం చేసి వారిపై తిరగబడింది.
బాధిత యువతి మాట్లాడుతూ...క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్న తను చిన్నప్పుడు స్వేచ్ఛగా బయటే ఆడుకునేదాన్నని గుర్తు చేసుకున్నది. ఐతే తను పాఠశాల, కళాశాల స్థాయికి వచ్చాక చాలామంది ఆకతాయిలు వెకిలి చేష్టలు చేస్తుండేవారని చెప్పుకొచ్చారు. ఓ సందర్భంలో తను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అక్కడికి వచ్చిన మగవారు తనను దుర్భాషలాడినట్లు చెప్పారు.
ఇలా ఎక్కడ కూడా స్త్రీ, పురుష సమానత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రే కాదు... పగలు కూడా ఒంటరిగా అమ్మాయి బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆమెపై అఘాయిత్యం చేయబోయిన నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.