Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మచారి నీకేంటి వీసా ఇచ్చేదన్న వారే ఇపుడు రెడ్‌కార్పెట్ పరిచారు: రాందేవ్ బాబా

ప‌తంజ‌లి పేరుతో ప్రొడ‌క్ట్స్‌ను మార్కెట్‌లోకి దించిన ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్.. ప్ర‌జ‌ల అభిరుచుల‌కు అనుగుణంగా ఫ‌క్తు వ్యాపారిగా మారిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న 800 ర‌కాల ఉత్పత్తులను మార్కెట్‌లో

బ్రహ్మచారి నీకేంటి వీసా ఇచ్చేదన్న వారే ఇపుడు రెడ్‌కార్పెట్ పరిచారు: రాందేవ్ బాబా
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (09:46 IST)
ప‌తంజ‌లి పేరుతో ప్రొడ‌క్ట్స్‌ను మార్కెట్‌లోకి దించిన ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్.. ప్ర‌జ‌ల అభిరుచుల‌కు అనుగుణంగా ఫ‌క్తు వ్యాపారిగా మారిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న 800 ర‌కాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు. వీటిలో పేస్ట్, కారం పొడులు, మందులు ఇత్యాది స‌రుకుల‌ు ఉన్నాయి. తాజాగా దుస్తుల వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు.
 
ప్రస్తుతం ఈయన వ్యాపార మార్కెట్ విలువ రూ.4,500 కోట్లు. అయితే తన జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాందేవ్‌ కూడా వీసా చిక్కులు తప్పలేదట. ఆయనకు విసా ఇచ్చేందుకు నిరాకరించారట. 
 
గతంలో తనకు ఎదురైన ఈ ఘటనని ఇండోర్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో గుర్తుచేసుకున్నారు. ''తొలిసారి నేను అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అందుకు అమెరికా అధికారులు నిరాకరించారు. అందుకు కారణం అడిగితే బ్రహ్మచారి కావడం, బ్యాంకు ఖాతా లేకపోవడం వల్ల వీసా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. 
 
ఈ రెండూ కాకుండా వేరే కారణం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు బాబాజీ… ఇప్పట్లో వీసా ఇవ్వలేమం అని తేల్చిచెప్పారు'' అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అమెరికానే తనను స్వయంగా ఆహ్వానించి… పదేళ్ల పాటు అమలులో ఉండే వీసా ఇచ్చిందని, కొరకుండానే పదేళ్ల వీసా అందించారని చెప్పుకొచ్చారు రాందేవ్ బాబా. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొగుడితో కాపురం చేస్తూ ఎలా చదువుతున్నావ్.. మహిళా ప్రొఫెసర్ వేధింపులు...వైద్య విద్యార్థిని సూసైడ్