Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైలు డ్రైవర్ సాహసం : కారం పడిన కళ్లతోనే...

రైలు డ్రైవర్ సాహసం : కారం పడిన కళ్లతోనే...
, బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (16:24 IST)
వాహనాన్ని నడిపే వ్యక్తి ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆ ప్రభావం ప్రయాణీకులందరిపై పడుతుంది. ప్రమాదం బారినపడే అవకాశమూ ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితులలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో రైలు డ్రైవర్ సాహసం చేశాడు. కళ్లలో కారంపడి బాధపడుతున్నా రైలుని నడిపి శభాష్ అనిపించుకున్నాడు. దాదాపు 18 కిమీ అలాగే రైలును నడిపాడు. 
 
ఇటీవల ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ స్టేషన్ నుంచి టిట్వాలాకు లోకల్ ట్రైన్ బయలుదేరింది. రైలు కొద్ది దూరం ప్రయాణించి కాల్వా స్టేషన్ సమీపంలోకి రాగానే కొంత మంది పోకిరీలు డ్రైవర్ క్యాబిన్‌లోకి కారం విసిరారు. ఆ కారం కాస్త డ్రైవర్ లక్ష్మణ్ కళ్లలో పడింది. కానీ రైలు మధ్య మార్గంలో ఉండటంతో రైలును ఆపలేదు. కానీ కంట్రోల్ రూమ్‌కి వెంటనే సమాచారం అందించాడు. 
 
వేరే డ్రైవర్ రావడం కుదరదని వారు తేల్చి చెప్పడంతో సహసానికి దిగాడు. కారం పడిన కళ్లతోనే ఇబ్బంది పడుతూ దాదాపు 18 కిమీ ప్రయాణించి దివా స్టేషన్‌కు చేర్చాడు. రైల్వే అధికారులు అతడిని ప్రశంసించి వెయ్యి రూపాయలు నగదు బహుమతి అందించడంతోపాటు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, రైలు 95 కిమీ వేగంతో వెళుతున్నప్పుడు ఈ దాడి జరిగిందని, రైలు ఆపితే వెనుక రైళ్లకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని రైలు ఆపలేదని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివో నుంచి #VivoV15Pro విడుదల.. 32ఎంపీ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో..