Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గొడ్డు మాంసం తినే మీకెందుకురా సీట్లు... రైలులో విద్వేష దాడి..

సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేస

గొడ్డు మాంసం తినే మీకెందుకురా సీట్లు... రైలులో విద్వేష దాడి..
, శనివారం, 24 జూన్ 2017 (12:17 IST)
సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నుంచి మధుర వెళ్తున్న రైలులో నలుగురు ముస్లిం యువకులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. అంతలో అక్కడికి 15 మంది యువకులతో కూడిన ముఠా ఒకటి వచ్చి సీట్లు తమకిచ్చి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దానికి ఆ నలుగురు ముస్లిం యువకులు నిరాకరించారు.
 
సీట్లు తమవని, అలా వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ హిందూ యువకుడు వారిని గొడ్డు మాసం తినేవారికి సీట్లు ఎందుకురా? అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ వ్యాఖ్యలను వారు వ్యతిరేకించారు. దీంతో ఆ 15 మంది కలిసి ఆ నలుగురినీ గొడ్డును బాదినట్టు బాదారు. 
 
అంతేకాదు, జునైద్‌ అనే 17 ఏళ్ల యువకుడ్ని కత్తితో పొడిచి చంపేశారు. అతని సోదరుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో షాకిర్ (23) అనే యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజాన్.. మక్కా మసీదుపై విధ్వంసానికి టెర్రరిస్ట్ బృందాల ప్లాన్.. అరెస్ట్ చేసిన పోలీసులు