Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేనకా గాంధీ జల్లికట్టుపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారా? లేదా? ఇందులో నిజమెంత?

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన జల్లికట్టుపై ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళనాట జరిగిన ఈ ఉద్యమం సోమవారంతో చివరి దశకు కూడా చేరుకుంది. జల్లికట్టుపై ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. తమిళనాడు రాష్ట్రం

Advertiesment
Jallikattu
, సోమవారం, 23 జనవరి 2017 (17:23 IST)
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన జల్లికట్టుపై ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళనాట జరిగిన ఈ ఉద్యమం సోమవారంతో చివరి దశకు కూడా చేరుకుంది. జల్లికట్టుపై ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. తమిళనాడు రాష్ట్రం చట్టాన్ని తీసుకొచ్చేందుకు సర్వత్రా రంగం సిద్ధం చేసుకుంటుంది.

ఈ నేపథ్యంలో జల్లికట్టు నిర్వహించడం కోసం తమిళ సర్కారు తెచ్చే చట్టానికి వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో తాను ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ అంటున్నారు. 
 
జల్లికట్టుకు అనుమతి లభించాలంటూ.. మధురై, అళంగానల్లూరు, చెన్నై, కోవై, తిరుచ్చి, సేలం వంటి ప్రాంతాల్లో యువత, ప్రజలు జనవరి 15వ తేదీ నుంచి ఆందోళనబాటపట్టారు. ఇలాంటి తరుణంలో శనివారం తమిళనాడు సర్కారు అవసర చట్టాన్ని తెచ్చింది. అయితే ఆందోళనకారులు అవసర చట్టం తమకు వద్దని.. జల్లికట్టుపై శాశ్వత పరిష్కారంగా ఓ చట్టాన్ని తేవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇందుకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో జల్లికట్టు ఉద్యమం చివరి దశకు చేరుకుంది.  
 
ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేబినెట్‌లో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేనకా గాంధీ జల్లికట్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మేనకా గాంధీ దీనిపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయలేదని ఆమే స్వయంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజమొందో అనేది తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టు ఉద్యమం.. ఫ్రీ సెక్స్ కోసం జరిగిందట.. రాధారాజన్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆపై క్షమాపణలు..