Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కింది వీటిలోనే ... అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్

Advertiesment
hammer

ఠాగూర్

, ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (13:11 IST)
అయోధ్య రామాలయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని కర్నాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. చిరునవ్వుతో కనిపిస్తున్న విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆయన కళా నైపుణ్యాన్ని రామ భక్తులు అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అయితే, ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాది మంది భక్తులు పూజలు చేస్తున్నారని, ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు. అరుణ్ యోగిరాజ్ కుటుంబం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కొడుకు రూపుదిద్దిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించడంతో తమ కుటుంబానికి దక్కిన మహాద్భాగ్యంగా భావిస్తున్నట్టు అరుణ్ యోగిరాజ్ తల్లి పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో బాల రాముడి విగ్రహానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అరుణ్ యోగిరాజ్ వెల్లడించారు. బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కిన పనిముట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెండి సుత్తి, బంగారు ఉలిని చేతిలో పట్టుకుని చూపిస్తూ, వీటితోనే బాల రాముడి దివ్యక్షేత్ర నేత్రాలను తీర్చిదిద్దానని తెలిపారు. ఈ ఫోటోను అరుణ్ యోగిరాజ్ తన  ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్ కావడం మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్రోలో టెక్నీషియన్ - టెక్నికల్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోవాలి..