Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాపారవేత్త అదానీని అరెస్టు చేయాలి.. మమత పార్టీ ఎంపీల డిమాండ్

Advertiesment
Adani
, శుక్రవారం, 24 మార్చి 2023 (14:44 IST)
వ్యాపారవేత్త అదానీని అరెస్టు చేయాలని మమత పార్టీకి చెందిన ఎంపీలు ఆర్థిక శాఖ కార్యాలయంలో డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది.ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్‌లో మోసం చేశారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్ అనే కంపెనీ నివేదిక ఇచ్చింది. దీంతో అదానీ కంపెనీల షేర్లు పతనమవడమే కాకుండా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఎల్ ఐసీ సహా కంపెనీల విలువ కూడా గణనీయంగా తగ్గింది. 
 
ఈ పరిస్థితిలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఈ డిమాండ్‌ను నొక్కి చెప్పేందుకు వారు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కార్యాలయానికి కూడా వెళ్లడం గమనార్హం. ఈ ఘటన నిన్న ఢిల్లీలో కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీపై అనర్హత వేటు - లోక్‌సభ సెక్రటరీ ఆదేశాలు జారీ