Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వియత్నాంలో బయల్పడిన ఇసుక రాతితో చేసిన ఏకశిలా శివలింగం

వియత్నాంలో బయల్పడిన ఇసుక రాతితో చేసిన ఏకశిలా శివలింగం
, శుక్రవారం, 29 మే 2020 (10:14 IST)
Shiva linga
వియత్నాంలో పురాతన శివలింగం బయటపడింది. ఈ శివలింగం 9వ శతాబ్ధానికి చెందిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియాలో వెల్లడించారు. చామ్‌ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న పునరుద్ధరణ పనుల్లో ఈ శివ లింగం బయల్పడింది. ఈ విషయాన్ని. దీంతో ఇరు దేశాల మధ్య 'నాగరికత సంబంధం' విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేయొచ్చని చెప్పారు. 
 
9వ శతాబ్ధానికి చెందిన ఇసుక రాతితో చేసిన ఈ ఏకశిలా శివలింగం అరుదైనదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్‌కి అభినందనలు తెలియజేశారు. 2011లో తాను వియత్నాంలో పర్యటించానని.. ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని జైశంకర్ ట్వీట్ చేశారు.
 
కాగా వియత్నంలోని క్వాంగ్‌ నామ్‌ పరిధిలో ఉన్న మై సన్‌ సిటీలో చామ్ టెంపుల్ ఉంది. దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ఇంద్రవర్మన్ 2 పరిపాలన కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
 
ఆయన బౌద్ధమతాన్ని బాగా ప్రచారం చేయగా.. బౌద్ధంతో పాటు హిందూ మతం కూడా అప్పట్లో వియత్నాంలో ఉన్నట్లు ఈ శివలింగం ద్వారా తెలుస్తోంది. ఇక ఈ దేవస్థానంలో ఇంతకుముందు కూడా ఆరు శివ లింగాలను గుర్తించారు. అయితే వాటన్నింటికంటే ఇది చాలా అద్భుతమైందని జై శంకర్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండపోచమ్మ ఆలయంలో చండీహోమం - పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు