Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే

మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు బిర్యానీ విందు పార్టీ ఇచ్చారు. ఆమె పేరు పరమేశ్వరి. ఈమె మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్

Advertiesment
tamil nadu
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:04 IST)
మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు బిర్యానీ విందు పార్టీ ఇచ్చారు. ఆమె పేరు పరమేశ్వరి. ఈమె మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్యానీ విందును ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా 25 మేకపోతులు, 250 కోళ్లను బలి యిచ్చి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ప్రముఖులు సహా సుమారు 3 వేల మందికి బిర్యానీ విందునిచ్చారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు, అన్నాడీఎంకే పాలన వందరోజులు ముగిసినందుకుగాను ఈ విందును ఏర్పాటు చేశానని పరమేశ్వరీపైకి చెబుతున్నప్పటికీ, తనకు మంత్రి పదవి రావాలని అమ్మవారిని కోరుతూ ఈ విందు ఇచ్చారని పార్టీ స్థానిక శాఖ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నాడీఎంకే మహిళా శాసనసభ్యురాలు ఒకేసారి 3 వేలమందికి బిర్యానీ విందును ఏర్పాటు చేయడం తారాపురంలో సంచలనం కలిగించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ కళ్యాణ్‌ను వదలొద్దు... రంగంలోకి కావూరి సాంబశివరావు