Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ సమాధి వద్ద హల్ చల్ చేసిన జయలలిత ఆత్మ.. సోషల్ మీడియాలో వైరల్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అమ్మ మరణంపై ఇంకా అనుమానాలున్నాయి. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళులు తీవ్ర ఆందోళ

Advertiesment
jayalalitha Ghost
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (11:43 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అమ్మ మరణంపై ఇంకా అనుమానాలున్నాయి. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. దీంతో ఆమెను ఖననం చేసిన మెరీనా బీచ్ యాత్రా స్థలంలా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ‘అమ్మ’ సమాధి వద్ద ఓ ఆత్మ కనిపించిందంటూ తమిళ వెబ్‌ సైట్లు కథనాలతో హోరెత్తించాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం అమ్మ ఆత్మ వార్తలతో హల్ చల్ చేస్తున్నాయి. కెమెరాకు చిక్కిన అమ్మ ఆత్మ కూడా ఆమె ను పోలిన ఆకారంలో ఉందని తమిళనాడు మీడియా ప్రసారం చేసింది. తన సమాధిని చూసేందుకు జయలలిత ఆత్మగా వచ్చిందంటూ పలు వెబ్ సైట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక ఫోటో కూడా జత చేశారు. 
 
దీంతో ఈ వార్త తమిళనాట వైరల్ అయ్యింది. దీంతో మరిన్ని కథనాలు ఆమె ఆత్మచుట్టూ అల్లుకుంటున్నాయి. అయితే, వీటిని పలువురు కొట్టి పారేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇవేం నమ్మకాలు అంటూ తీసిపారేస్తున్నారు. ఈ ఫోటో కూడా ఫొటోషాప్ మాయాజాలమని చాలామంది కొట్టిపారేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.2000 నోటు రద్దు ఖాయం? భవిష్యత్తులో రూ.500 నోటే పెద్ద నోటు..