Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఆ హక్కు అల్లాది మాత్రమే: అసదుద్ధీన్

అయోధ్యలో మసీదు నిర్మాణమే కాదు.. ఎక్కడైనా మసీదు నిర్మాణంలో పూర్తి హక్కు అల్లాది మాత్రమేనని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మసీదు నిర్మాణం అనేది కేవలం ఏదో ఒక మతపెద్ద

అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఆ హక్కు అల్లాది మాత్రమే: అసదుద్ధీన్
, సోమవారం, 14 ఆగస్టు 2017 (15:27 IST)
అయోధ్యలో మసీదు నిర్మాణమే కాదు.. ఎక్కడైనా మసీదు నిర్మాణంలో పూర్తి హక్కు అల్లాది మాత్రమేనని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మసీదు నిర్మాణం అనేది కేవలం ఏదో ఒక మతపెద్ద చెప్పాడనే కారణంగా చేపట్టడం కుదరదన్నారు. షియా, సున్ని, బరెల్వి, సూఫీ, దియోబంది, సలఫై, బొహ్రి ఇలా ఎన్ని బోర్డులు ఉన్నా వాటి బాధ్యత నిర్వాహణే తప్ప ఆధిపత్యం చెలాయించడం కుదరదని అసదుద్ధీన్ పేర్కొన్నారు. 
 
అయోధ్యకు దూరంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించేందుకు సిద్ధమేనని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు పేర్కొనడాన్ని అసదుద్ధీన్ తప్పుబట్టాడు. అల్లాను, ఆయనిచ్చే తీర్పును నమ్మేవాళ్లు మాత్రమే మసీదును నిర్మిస్తారని అస‌దుద్దీన్ వెల్లడించారు. వారంతా వారి రక్షణ కోసం అందులో నమాజ్‌లు నిర్వహిస్తారని తెలిపారు. మసీదులకు అల్లా మాత్రమే ఓనరని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజాకు పోటీగా అంజలి - పవన్ కళ్యాణ్‌ పార్టీలో చేరుతుందట...