Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల్లో గెలిపిస్తే మద్యంపై 50 శాతం రాయితీ...

ఎన్నికల్లో గెలిపిస్తే మద్యంపై 50 శాతం రాయితీ...
, గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:34 IST)
ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల హామీలను గుప్పిస్తుంటారు. పార్టీలు అయితే వివిధ రకాల ఉచితాలను ఇస్తే.. అభ్యర్థులు కూడా సొంతంగా అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీలిస్తుంటారు. తాజాగా, ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన హామీ ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. 
 
తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిస్తే మద్యంపై 50 శాతం డిస్కాంట్ ఇస్తామని, పండుగల సందర్భంగా ముస్లిం కుటుంబాలకు మేకలను ఉచితంగా ఇస్తామని ఢిల్లీలోని సాంజీ విరాసత్ పార్టీ హామీ ఇచ్చింది. మహిళలకు ఉచితంగా బంగారం అందజేస్తామని తెలిపింది.
 
అలాగే, పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఉచితంగా బస్సు, మెట్రో ప్రయాణం, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు, ఉచితంగా నిత్యావసరాల పంపిణీ, ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, అమ్మాయి పెండ్లికి రూ.2.5 లక్షలు, నిరుద్యోగ భృతి రూ.10000, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.5000 పింఛన్, ప్రైవేట్ దవాఖానల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు ఇలా పలు హామీలను కురిపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటన నేర్చుకోవాలంటే దుస్తులిప్పేయాల్సిందే: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హుకుం