Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క నిమిషమే.. చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు.. అఖిలేష్‌పై పోటీ చేస్తా: ములాయం

యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని

Advertiesment
ఒక్క నిమిషమే.. చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు.. అఖిలేష్‌పై పోటీ చేస్తా: ములాయం
, సోమవారం, 16 జనవరి 2017 (17:35 IST)
యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీకి దిగుతానని సమాజ్ వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ములాయం అఖిలేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిలాఉంటే, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోటీలోకి దిగబోతున్నారని సంకేతాలు కూడా వస్తున్నాయి.
 
ఇంకా ములాయం సింగ్ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీని, తమ పార్టీ గుర్తును కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని అయితే అఖిలేష్ తన మాటలను లెక్కచేయడం లేదని ఆరోపించారు. అఖిలేష్‌తో చర్చించేందుకు ఇప్పటికే మూడుసార్లు పిలిచానని.. అయితే అఖిలేష్ ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి.. తాను చెప్పేది వినకుండానే వెళ్లిపోయాడని ములాయం వ్యాఖ్యానించారు. తన కుమారుడు రాష్ట్రంలోని ముస్లింలను రెచ్చగొడుతున్నాడని.. బీజేపీతో పాటు పలు ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది: గర్భవతిని చేశాడు.. తల్లిదండ్రుల వెంట వెళ్ళిపోయాడు.. బ్లేడుతో?