Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమాన మరుగుదొడ్డిలో పాలిథిన్ కవర్లు - వస్త్రాలు.. విచారణకు ఏఐ ఆదేశం

Advertiesment
flight

ఠాగూర్

, మంగళవారం, 11 మార్చి 2025 (09:28 IST)
ఈ నెల ఆరో తేదీ నుంచి షికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం పది గంటల ప్రయాణం తర్వాత తిరిగి షికాగోకు వెళ్లింది. ఈ వ్యవహారంపై విమానయాన సంస్థ విచారణ జరిపి ఓ స్పష్టతనిచ్చింది. 
 
ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా 126 విమానంలోనే టాయిలెట్ల సమస్య తలెత్తిందని, మొత్తం 12 టాయిలెట్లు ఉండగా, అందులో ఎనిమిది పని చేయడం లేదని సిబ్బంది గుర్తించారని సంస్థ పేర్కొంది. టాయిలెట్ పైపుల్లో పాలిథిన్ బ్యాగులు, దుస్తులు ఇరుక్కునిపోవడం వల్ల అవి పనిచేయడం లేదని తెలిపింది. 
 
ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు తెలిపింది. ఆ సమయంలో విమానం అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తుండగా ఐరోపాలోని నగరాల్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. రాత్రి సమయం కావడం, అక్కడి విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌పై ఆంక్షలు ఉండటంతో తిరిగి షికాగోకు మళ్లించాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది. 
 
ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. విమానాన్ని వెనక్కి మళ్లించిన అనంతరం ఎయిరిండియా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమారుడుకి విషమిచ్చి.. కుమార్తెకు ఉరివేసి చంపేశారు.. దంపతుల ఆత్మహత్య!!