Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తైక్వాండో నేర్చుకోనున్న వైద్యులు... ఇకపై వైద్య కోర్సులో మార్షల్ ఆర్ట్స్‌ను తప్పనిసరి చేస్తారా..

దేశవ్యాప్తంగా వైద్యులపై రోగులు, రోగుల బంధువుల దాడులు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డిఎ) ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మే 15 నుండి ప్రతి రోజు రాత్రి 7 న

Advertiesment
AIIMS Doctors
, గురువారం, 4 మే 2017 (11:05 IST)
దేశవ్యాప్తంగా వైద్యులపై రోగులు, రోగుల బంధువుల దాడులు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డిఎ) ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.  మే 15 నుండి ప్రతి రోజు రాత్రి 7 నుండి 8 వరకు 1500 మంది వైద్యులకు ఒక్కో బ్యాచ్‌లో 100 మంది చొప్పున జింఖానా క్లబ్‌లో తైక్వాండో శిక్షణను ఇవ్వనుంది. 
 
ఎమర్జెన్సీ మరియు అవుట్‌పేషెంట్ విభాగాల్లో రోగుల బంధువులు వైద్యులపై దాడులు పెరిగిపోతున్న సంగతి విదితమే. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోమని పలు అభ్యర్థనలు చేసామని, ఆర్‌డిఎ వైద్యులకు ఆత్మరక్షణ తరగతులను నిర్వహించమని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌ను కోరినట్లు ఎయిమ్స్ ఆర్‌డిఎ అధ్యక్షులు విజయ్ గుర్జార్ తెలిపారు. 
 
వైద్యులపై దాడులు జరిగిన సందర్భంలో మహారాష్ట్రలోని దాదాపు 3 వేల మంది వైద్యులు ఐదు రోజులపాటు స్ట్రయిక్ చేసారు. వీరికి మద్దతుగా ఎయిమ్స్ ఆర్‌డిఎ వైద్యులు సైతం హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తించారు. అలాగే ఢిల్లీలోని ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు ఒకరోజు మూకుమ్మడిగా సెలవు పెట్టేసారు. 
 
ఇప్పుడు తాజాగా ఈ ఆత్మరక్షణ తరగతుల నేపథ్యంలో ఇకపై ఎంబిబిఎస్ లేదా ఆపై కోర్సుల్లో తైక్వాండో, కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్‌ను తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేయవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భావన తరహాలో గాయనిపై ఓలా క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం.. కానీ..?