Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిన్నీ.. ఎమ్మెల్యేలు మాట వినడం లేదు... శశికళతో దినకరన్

తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో చేతులు కలిపిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ముప్పుతిప్పలు పెట్టాలని చూసిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవ

పిన్నీ.. ఎమ్మెల్యేలు మాట వినడం లేదు... శశికళతో దినకరన్
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (11:15 IST)
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో చేతులు కలిపిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ముప్పుతిప్పలు పెట్టాలని చూసిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఆయన వర్గం ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు.
 
తనకు జై కొట్టిన 19 ఎమ్మెల్యేలను దినకరన్ పుదుచ్చేరికి తీసుకెళ్లి క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ రాజకీయాలకు సీఎం ఎడప్పాడి ఏమాత్రం తలొగ్గలేదు. దీంతో తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని దినకరన్ వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు ససేమిరా అన్నారు. 
 
ఈ నేపథ్యంలో దినకరన్ రిసార్ట్‌లో ఉంచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అయినట్టు తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నేడో రేపో చేజారిపోనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దినకరన్ వారిని కాపాడుకునేందుకు హైదరాబాద్ తరలించనున్నట్టు సమాచారం. ఈ మేరకు హైదరాబాదులో ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.  
 
అదేసమయంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు దినకరన్ బెంగుళూరు జైలులో ఉన్న శశికళను చూసేందుకు వెళ్లనున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో శశికళ శిక్షను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్వహించనున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంతో పాటు ప్రస్తుత రాజకీయాలపై శశికళతో ఆయన చర్చించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

153 కేజీల సమోసా... ఎక్కడ? వైరల్ అయిన వీడియో