శబరిమలకు 98 ప్రత్యేక రైళ్లు... ఆదివారం నుంచి రిజర్వేషన్ అందుబాటులోకి...
శబరిమల భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే 98 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లలో ఆదివారం నుంచే భక్తులకు రిజర్వేషన్లు అందుబాటులో రానున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్, వి
శబరిమల భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే 98 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లలో ఆదివారం నుంచే భక్తులకు రిజర్వేషన్లు అందుబాటులో రానున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్, విజయవాడ, కాకినాడ, నర్సాపూర్, కరీంనగర్, మచిలీపట్నం, సిర్పూర్ కాగజ్నగర్, ఔరంగాబాద్, అకోలా, తిరుపతి, ఆదిలాబాద్, కొల్లాం నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వివరించింది.
శబరిమల వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో తిరుపతిని కూడా దర్శించుకుంటారు కాబట్టి వారి కోసం తిరుపతి-అకోలా, తిరుపతి-ఆదిలాబాద్ మధ్య వచ్చే నెల 6వ తేదీ నుంచి జనవరి 18 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు ఆదివారం నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. రైళ్ల షెడ్యూల్ కోసం దక్షిణమధ్య రైల్వే వెబ్సైట్లో కానీ సమాచార విభాగం నంబరుకు కానీ ఫోన్ చేసి తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు.