Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏడేళ్ల బాలికపై కొడుకు అత్యాచారం.. కేసు పెట్టడంతో కొట్టిచంపేసిన రేపిస్ట్ తండ్రి.. చివరికి ఏమైంది?

ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కొడుకును పోలీసులకు అప్పగించకుండా... రేప్ చేశాడని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో.. తన కుమారుడిచే అత్యాచారానికి గురైన బాలికను కొట్టి చంపిన కిరాతకమై

ఏడేళ్ల బాలికపై కొడుకు అత్యాచారం.. కేసు పెట్టడంతో కొట్టిచంపేసిన రేపిస్ట్ తండ్రి.. చివరికి ఏమైంది?
, గురువారం, 30 జూన్ 2016 (17:33 IST)
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కొడుకును పోలీసులకు అప్పగించకుండా... రేప్ చేశాడని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో.. తన కుమారుడిచే అత్యాచారానికి గురైన బాలికను కొట్టి చంపిన కిరాతకమైన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి కుమారుడైన యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జూన్ ఐదో తేదీన బాలికపై పొరుగింట్లోని 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించినట్లు బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. ఒత్తిడి మేరకు కంప్లైంట్ తీసుకున్న పోలీసులు గత ఆదివారం 15 ఏళ్ల నిందితుడైన బాలుడిని అరెస్ట్ చేశారు. కానీ రెండు రోజుల తర్వాత బాలుడి తండ్రి.. మరో ఐదుగురితో కలిసి రాత్రిపూట బాలికను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టి చంపేశారు.
 
తన కొడుకును కేసు నుంచి కాపాడేందుకు బాలుడి తండ్రి బాలికను కొట్టి చంపేశాడని, అతడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం పాప మృతదేహాన్ని బుధవారం కుటుంబసభ్యులకు అప్పగించే సమయంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చిన్నారి కుటుంబ సభ్యులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ‌రావ‌తికి అదిరిపోయే ఆర్టీసీ సర్వీసులు... ప్రారంభం...