Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ‌రావ‌తికి అదిరిపోయే ఆర్టీసీ సర్వీసులు... ప్రారంభం...

గుంటూరు నుంచి వెలగపూడికి బుధవారం ఆర్టీసీ సర్వీసులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు నుంచి వయా తాడికొండ, తుళ్ళూరు మీదుగా సచివాలయానికి రాకపోకలు సాగించనున్నాయి. రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రీజనల్‌

అమ‌రావ‌తికి అదిరిపోయే ఆర్టీసీ సర్వీసులు... ప్రారంభం...
, గురువారం, 30 జూన్ 2016 (17:32 IST)
గుంటూరు నుంచి వెలగపూడికి బుధవారం ఆర్టీసీ సర్వీసులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు నుంచి వయా తాడికొండ, తుళ్ళూరు మీదుగా సచివాలయానికి రాకపోకలు సాగించనున్నాయి. రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రీజనల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. 
 
మంగళగిరి నుంచి తుళ్ళూరు వరకు వయా సచివాలయం మీదుగా రాకపోకలు సాగించేలా అదనపు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. రెయిన్ ట్రీ పార్కు నుంచి ఉదయం 8.45 గంటలకు, 9.05 గంటలకు, సచివాలయం నుంచి రెయిన్ ట్రీ పార్కునకు సాయంత్రం ఐదు గంటలకు, 5.20 గంటలకు బస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. 
 
అలాగే గుజ్జనగుండ్ల నుంచి సచివాలయానికి, సచివాలయం నుంచి గుజ్జనగుండ్లకు మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రీజనల్‌ మేనేజర్‌ శ్రీహరితో పాటు ఆర్టీసీ అధికారులు వెలగపూడిలోని సచివాలయాన్ని సందర్శించి ఆర్టీసీ సర్వీసుల రాకపోకలను పరిశీలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్... నాతో పెట్టుకున్నది మర్చిపో...: అలాగా... ఐతే ఈ సంగీతం మధ్యే చావు... సచిన్