Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మృతి.. ఎక్కడ?

హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మృతి.. ఎక్కడ?
, గురువారం, 6 మే 2021 (22:34 IST)
మద్యానికి బదులుగా ఆల్కహాల్ కలగలిసిన హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మరణించిన విషాద ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. ఇదే ఘటనలో మరో ఐదుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. 
 
సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో జరిగిందీ ఘటన. ఏడుగురిలో నలుగురు మంగళవారం రాత్రి తమ ఇంట్లోనే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.
 
కమలేశ్ ధురి (32), అక్షయ్ ధురి (21), రాజేశ్ ధురి (21), సమ్రు ధురి (25) కలిసి మంగళవారం రాత్రి 91 శాతం ఆల్కహాల్ ఉండే డ్రోసెరా-30 అనే హోమియోపతి సిరప్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు 
 
గ్రామంలోని ఓ హోమియోపతి ప్రాక్టీషనర్ వారికి ఆ సిరప్ ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు దానిని మద్యానికి బదులుగా తాగినట్టు తెలుస్తోందని, అయితే మరణానికి కచ్చితమైన కారణం తెలియదని ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్‌తో ఏపీడీ మృత్యువాత