Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంజలి మృతి కేసులో సందేహాలెన్నో.. ఎన్నెన్నో...

anjali
, బుధవారం, 4 జనవరి 2023 (16:27 IST)
ఢిల్లీలోని కంఝావాలా ఏరియాలో అంజలి (20) అనే యువతి కారు ప్రమాదంలో చనిపోయింది. ఈ యువతి చనిపోయి రోజులు గడిచిపోతున్నప్పటికీ.. ఆమె మృతికి స్పష్టమైన కారణాలు ఏంటో పోలీసులు ఇప్పటివరకు వెల్లడింలేకపోతున్నారు. దీనికి కారణం.. కారు నడిపిన ఐదుగురు నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కుమారుడు ఉన్నట్టు సమాచారం. అందుకే పోలీసులు కూడా మృతికి కారణాలు వెల్లడించకుండా నాన్చుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
 
డిసెంబరు 31వ తేదీ రాత్రి తన స్నేహితులతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్న అంజలి.. జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో నిధి అనే స్నేహితురాలితో కలిసి స్కూటీపై ఇంటికి బయలుదేరింది. 
 
ఆ స్కూటీని మార్గమద్యంలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో నిధి ఎగిరిపడగా, అంజలి మాత్రం కారు కింద ఇరుక్కుని పోయింది. అయినా కారును ఆపకుండా ఐదుగురు నిందితులు పరారయ్యారు. ఆఖరుకి 12 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అంజలి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వారు పారిపోయారు. 
 
ఈ అమానవీయ ఘటనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుకున్నాయి. కానీ 60 గంటలు గడిచిపోయినా సమాధానాలు మాత్రం కొన్ని ప్రశ్నలకే లభించింది. కొత్త సంవత్సర వేళ ఒక కారు 12 కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని ఈడ్చుకెళుతుంటే దారిలో ఒక్కరంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేరా? ఒక వేళ పోలీసులు ఉంటే మహిళను ఢీకొట్టిన నిందితులు ఎలా తప్పించుకోగలిగారు అనే సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతి తక్కువ ధరకే మరో స్మార్ట్ ఫోన్.. ధర రూ.6,499 మాత్రమే..