Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్నాథ ఉల్టా రథయాత్రలో విషాదం.. ఆరుగురు చిన్నారులు మృతి

Rath Yatra
, గురువారం, 29 జూన్ 2023 (09:15 IST)
త్రిపురలో నిర్వహించిన జగన్నాథ ఉల్టా రథయాత్రలో తీరని విషాదం చోటుచేసుకుంది. రథం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతం జరిగి ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఓ పురుషుడు ఉన్నారు.
 
ప్రమాదంలో గాయపడిన వారిని కైలాషహర్‌లోని ఉనకోటి ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదానికి కేంద్రంగా మారిన ఢిల్లీ మెట్రో రైలు.. కొట్టుకున్నారు..