Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది..

ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది..
, మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:32 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి కామాంధుడి చర్యకు బలైపోయింది. ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అహ్మద్‌నగర్ జిల్లా కారేగావ్ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం సాయంత్రం ఆటవిడుపు కోసం బయటికి వెళ్లారు. 
 
సరదాగా ఆడుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఐదేళ్ల చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానికుల సాయంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక మరణించినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టు మార్టంకు బాలిక మృతదేహాన్ని తరలించారు.
 
అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించినట్లు తెలిసింది. దీంతో పాటు ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అహ్మద్ నగర్ జిల్లా దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో మిర్రర్ నౌ జర్నలిస్టుపై దాడి.. ముక్కు పగిలిపోయేలా పిడిగుద్దులు (వీడియో)